వైసీపీ రాజ్యసభ ఎంపీ ట్విట్టర్ ద్వారా మరోసారి నారా లోకేశ్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు బిల్గేట్స్ని తీసుకొచ్చానన్నాడని... బిల్ క్లింటన్ని తీసుకొచ్చానన్నాడని... టోని బ్లెయిర్ని తీసుకొచ్చానన్నాడని... పప్పును తీసుకొచ్చాడా...? లేదా...? అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. మరో ట్వీట్ లో లోకేశ్ ను పై విమర్శలు చేశారు.
పప్పూ... నాన్న మీద అలిగావా...?... పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా?... పప్పూ... తప్పు తప్పు..! అంటూ సెటైర్లు వేశారు. మరో ట్వీట్లో చంద్రబాబు విశాఖకు రావడం కోసం కేంద్రాన్ని అనుమతి అడిగారని కేంద్రం ఏమందో చెప్పాలని... మీబోటి అంతర్జాతీయ నాయకులు యూ టర్న్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీని పర్మిషన్ అడగటం ఏమిటి చెప్పండి? అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
బిల్ గేట్స్ ని తీసుకొచ్చానన్నావ్...
— Vijayasai reddy v (@VSReddy_MP) May 25, 2020
బిల్ క్లింటన్ ని తీసుకొచ్చానన్నావ్...
టోనీ బ్లెయిర్ ని తీసుకొచ్చానన్నావ్...
ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా?
పప్పూ...తప్పు..!
— Vijayasai reddy v (@VSReddy_MP) May 25, 2020
నాన్న మీద అలిగేవా?
పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా?
పప్పూ... తప్పు తప్పు..!