సరిహద్దులో చైనా బలగాల తో పోరాడి అమరుడైన సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్  సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోష్ బాబు భార్య కు  కూడా ఉద్యోగం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

 

 దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణకి గర్వకారణం గా మారిన కల్నల్  సంతోష్ బాబు అంత్యక్రియలు జరిగిన చోట స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా సూర్యాపేట కూడలిలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని ఓ సర్కిల్కు సంతోష్ బాబు పేరు పెడతాం మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: