హైదరాబాద్ పోలీసులు నగరంలో మరో డ్రగ్స్ కేసును ఛేదించారు. ముగ్గురు ముఠా సభ్యుల దగ్గరినుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎండీఎం, కొకైన్, గంజాయి, అశిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నట్టు సమాచారం. అధికారులు ఈ ముఠా ముంబయి, గోవా, బెంగళూరు, చెన్నై నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు గుర్తించింది. 
 
లాక్ డౌన్ సమయంలో అత్యవసర మెడిసిన్ పేరుతో ఈ డ్రగ్స్‌ని తీసుకువచ్చినట్లుగా అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భరత్ ను పట్టుకున్నారు. భరత్ లాక్ డౌన్ సమయంలో కూడా చాలామందికి కూడా డ్రగ్స్ విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. గోవా నుంచి కోకెన్, ముంబయి నుంచి ఎండీఎంఏ, చెన్నై నుంచి బ్లోటని, వైజాగ్ నుంచి గంజాయి తెప్పించినట్లు అధికారులు గుర్తించారు. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: