ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే . సామాన్య ప్రజలనే కాదు అధికారులు నాయకులను సైతం ఈ మహమ్మారి వైరస్ బెంబేలెత్తిస్తుంది . బంగ్లాదేశ్ రక్షణ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసిన్ కరోనా వ్యాధి సోకిన చికిత్స పొందుతూ మరణించారు.
అనారోగ్యంతో ఉన్న ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో జూన్ 6వ తేదీ నుంచి ఆయన కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు, ఇక జూన్ 18 నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం ఏర్పాటు చేశారు, కాని తాజాగా గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. దీనిపై బంగ్లాదేశ్ రక్షణశాఖ ఆయనకు నివాళులు అర్పించారు