కరోనా  కట్టడిలో కేరళ ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం కేరళలో ప్రతీ రోజు వందల్లో నమోదు అవుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే కేరళ లోని తిరువనంతపురం కార్పొరేషన్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 'ట్రిపుల్ లాక్‌డౌన్' ని అమలు చేస్తున్నారు. అక్కడ కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. ఎంట్రీ మరియు ఎగ్జిట్ రోడ్ మినహా నగరానికి వెళ్ళే ప్రధాన రహదారులు కూడా మూసి వేసారు అధికారులు. డ్రోన్ లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: