మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేసింది భారత్​. భారత్​లో మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను ఇటీవల తీసుకొచ్చిన కొన్ని చట్టాలు నొక్కేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్​ మిషెల్​ బాచెలే పేర్కొనటంపై ఈమేరకు స్పందించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని(ఎఫ్​సీఆర్​ఏ) మరింత కఠినతరం చేయటాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది భారత విదేశాంగ శాఖ.


స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందే నిధులకు సంబంధించి భారత్​లో అమలవుతున్న ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్​ మిషెల్​ బాచెలే. మానవ హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: