అమరావతి ప్రాంతంలో ఉద్యమం సంగతి ఎలా ఉన్నా సరే అక్కడి రైతు మాత్రం పోలీసులను బాగా టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు తమను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక తాజాగా సిఎం జగన్ కు సేల్ఫీ వీడియో పంపే ఆలోచన చేసాడు ఒక రైతు. తుళ్లూరు మండలం లింగాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో చేసాడు.

తనకు ప్రాణహాని ఉందంటూ సీఎం కు విన్నవించాడు. ఎంపీ నందిగం సురేష్ అనుచరుల నుంచి తనని కాపాడాలని ఆయన కోరారు. జూన్ నెలలో తనపై దాడి చేశారని సిఎంకు పొన్నూరు శ్రీనివాసరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేసారు. జూన్ 27న దాడి జరిగినట్లు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసుల తీరుపై సెల్ఫీ వీడియోలో సిఎంకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: