ఐదు మ్యాచ్ ల కోసం ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన భారత జట్టుకు సిరీస్ మొదలు కాకముందే ఎదురు దెబ్బ తగిలింది. టూర్ కి సెలెక్ట్ చేసిన ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా సిరీస్ నుంచి దూరమయ్యారు. ఈ క్రమంలో వారి స్థానంలో మరో ముగ్గురు ప్లేయర్లను ఇంగ్లాండ్ కి పంపనుంది బీసీసీఐ. వివరాల్లోకి వెళితే శుబ్‌మన్ గిల్‌, వాషింగ్టన్ సుందర్ మరియు ఆవేశ ఖాన్ వామప్ మ్యాచ్ లోగాయాలపాలయ్యారు. వీరు కోలుకోవడానికి సమయం పెట్టె అవకాశం ఉందని వైద్యులు తేల్చడం తో వీరి స్థానంలో ఇండియా నుంచి మరో ముగ్గురు ప్లేయర్లను పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఫుల్ స్వింగ్ లో ఉన్న పృథ్వీ షా తో పాటు సూర్యకుమార్ యాదవ్ మరియు స్పిన్నర్ జయంతి యాదవులను బీసీసీఐ ఇంగ్లాండ్ కి పంపే పనిలో ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: