డేటా ప్రొఫైల్ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా ఉండేలా చూసుకోవాలని, అలా ఉంటేనే భవిష్యత్తులో అనేక ఉపయోగాలు ఉంటాయని, వాటన్నిటిని పార్టీ కేంద్ర కార్యాలయంతో కూడా అనుసంధానం జరుగుతుందని తెలిపారు. సుమారుగా 15 లక్షల మంది వైసీపీ సైన్యం వివిధ కమిటీలలో భాగస్వామ్యులుగా ఉంటారని తెలియజేశారు. ఇది వైసీపీ పార్టీకి కీలకమైనటువంటి అంశం అన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేశామని ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సోల్జర్స్ ను తయారు చేసే కార్యక్రమంలో భాగమని తెలిపారు.
ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారని, కమిటీ నియామకం పైన నాయకులకు అవసరమైన సలహాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో సైంటిఫిక్ గా కమిటీలను నియామకాలు పూర్తి అయ్యాయి. పుంగనూరు, వేమూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్టుగా మైక్రో లెవెల్ లో అన్ని కమిటీలను పూర్తి చేశామని, ఈ కమిటీ నియామకం పైన పార్టీ సీనియర్లతో ఏర్పాటు చేశామని వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకొని, ఒక డ్రైవ్ లాగా వీటిని పూర్తి చేయాలని దిశానిర్దేశం ఇచ్చామంటూ తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కమిటీ నియమకాలాన్ని పక్కాగా జరిగాయి అంటే ఏ ఎన్నికలు జరిగినా గెలవడానికి సులభతరంగా అవుతుందని, అలాగే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా ఈ కమిటీల ద్వారానే విజయవంతం చేయవచ్చు అంటు తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి