బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే బాంద్రా నివాసంలో ఎన్‌సిబి దాడులు చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారం లో అనన్య పాండే కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా తాజాగా మాదకద్రవ్యాల నిరోధక ఏజెన్సీ (ఎన్సిబి) దర్యాప్తును విస్తృతం చేసింది. ఇటీవల ముంబైలో క్రూయిజ్ పార్టీని ఛేదించిన తర్వాత మరింత పరిశీలనతో విచారణ చేపడుతోన్న ఎన్సిబీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో  పేర్లు బయటపడినందున మరింత మంది బాలీవుడ్ ప్రముఖులు స్కానర్‌లో ఉన్నారని మాదకద్రవ్యాల నిరోధక ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అనన్య పాండే తో పాటూ ఆర్యన్ ఖాన్ ఇళ్లపై కూడా ఎన్సిబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వగా అతడికి బెయిల్ కూడా దొరకడం లేదు. ఇదిలా ఉంటే అనన్య పాండే ను పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు పరిచయం చేయగా ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది...ఇక ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: