ఆంద్ర ప్రదేశ్ లో ఉద్యోగులు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పై పోరు జరుపుతన్న వేళ  ఏపి ఆర్థిక శాఖ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ? వారేమీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై మల్లగుల్లాలు పడటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ప్రధాన ఉన్నతాధికారులు ఢిల్లీలో ఉన్నారు ?  వారక్కడ ఏం చేస్తున్నారు ?
కేంద్ర ఆర్థిక శాఖ,  ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పై ఆరా తీస్తోంది. గతంలో కేటాయించిన మొత్తం, ఏ ఏ పద్దులకు ఎంతెంత వ్యయం చేశారు ?  వాటి జమా ఖర్చులు ఏంటి?  ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ? ఇత్యాది వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ తెలుసుకుంటోంది. ఢిల్లీలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్ లో ఈ ఉన్నతాధికారుల భేటీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన |ఐదుగురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోంటున్నట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,  రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, సి.ఎస్. సమీర్ శర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు  హాజరయ్యారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: