టాలీవుడ్ సమస్యలపై ఇవాళ చిత్ర పరిశ్రమలో ఓ కీలక సమావేశం జరగబోతోంది. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరగనున్న ఈ  సమావేశానికి 24 శాఖల సంఘాల ప్రతినిధులు వస్తారు. ఈ కీలక సమావేశానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ పెద్దలు చిరంజీవి, మోహన్‌బాబు కూడా వస్తారని సమాచారం ఉంది.


వీరే కాకుండా మురళీ మోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ఇతర ప్రముఖులు కూడా  హాజరవుతారట. వాస్తవానికి ఈ కీలక సమావేశం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ కంటే ముందే జరగాల్సి ఉంది. అయితే.. అనేక కారణాలతో రెండు సార్లు వాయిదా పడింది. ఈ మధ్య  ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు. మరి ఈ భేటీకి ఎవరెవరు వస్తారో.. ఏం నిర్ణయాలు తీసుకుంటారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: