తెలంగాణకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు ముందుకు రాని సీఎం కేసీఆర్‌.. ప్రధాని పదవిని అవమానించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ రాజకీయ మర్యాద మర్చిపోయారన్న బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... వ్యక్తిని కాదు ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారని విమర్శించారు. టీఆర్ఎస్ వైఖరి ఇంతే అని ప్రజలందరికీ అర్థమైందన్న స్మృతి ఇరానీ.. కేసీఆర్‌ కుటుంబానికి, ఆయన పార్టీకి రాజకీయం సర్కస్ కావొచ్చని ఎద్దేవా చేశారు.

బీజేపీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోందన్న స్మృతి ఇరానీ.. విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బంగాల్‌లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసిన  స్మృతి ఇరానీ.. బంగాల్‌ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: