కాళేశ్వరం అంశంలో సుప్రీంకోర్టులో తెలంగాణకు ఊరట లభించింది. మూడో టిఎంసి పై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. మూడో టిఎంసి కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సిడబ్ల్యుసిలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు లోబడి ఉంటాయని కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది.


నష్ట పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా సుప్రీంకోర్టు  అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం మూడో టిఎంసి కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్ లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం తరపున  సీనియర్ న్యాయవాది వైద్యనాదన్  వాదనలు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: