సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి చెండాలమైన  పనులుగా ఉందని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తర్వాత మరో పార్టీకి మారిన వారిని ఉరి తీసే చట్టాలు కావాలి.. రాళ్లతో కొట్టాలి అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎంపీలను కాంగ్రెస్ లో  ఎలా చేర్చుకుంటున్నారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.  సీఎం ఇపుడు వాళ్ళందర్నీ రాళ్లతో కొడతారా అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజున.. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం తగ్గిందని అందుకే పార్టీ వీడుతున్నట్లుగా దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖంతో చేరారని దాసోజు శ్రవణ్ ద్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీలను వంచిస్తుందని దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: