భారతదేశంలోని అతిపెద్ద
బ్యాంక్ స్టేట్
బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఎస్బీఐ) తాజాగా అదిరిపోయే ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఎస్బీఐ బ్యాంకు కస్టమర్లకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీనితోపాటు మరో 10 శాతం అదనపు క్యాష్ బ్యాక్ ప్రయోజనం కల్పిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఓయో రూమ్స్ ద్వారా హోటల్ బుకింగ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఓయో హోటల్ బుకింగ్ ఆఫర్ కేవలం ఇంకో వారం రోజులు పాటే అందుబాటులో ఉంటుంది.
నవంబర్ 10 తో ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ఎస్బీఐ కస్టమర్లు OYOYONO ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని హోటల్ బుకింగ్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది అని తెలిపారు.
ఓయో ఆఫర్ పొందాలంటే ట్రాన్సాక్షన్ వ్యాల్యు మినిమం రూ.1,000 లేదా ఆపైన ఉండాలి. అలాగే ఒక కార్డు పై గరిష్టంగా రూ.500 వరకు క్యాష్ బ్యాక్ మాత్రమే లభిస్తుంది. ఇకపోతే ఎస్బీఐ కొత్త రూల్స్
నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో స్టేట్
బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం చూపబోతుంది.
ఎస్బీఐ తన సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని, అందుకే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామని
బ్యాంక్ ప్రకటించింది. రూ.లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల పై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతుంది. ఇప్పుడు ఈ అకౌంట్లపై 3.5 శాతం కాకుండా 3.25 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.
అయితే రూ.లక్షరూపాయల పైన డిపాజిట్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. వీటి పై 3 శాతం వడ్డీ రేటే వస్తుంది. సాధారణంగా చాలా మంది అకౌంట్ల పై రూ.లక్షకు లోపే డబ్బులు ఉంటాయి. అందువల్ల
బ్యాంక్ వీటిపైనే వడ్డీ రేట్లు తగ్గించినట్లు తెలుస్తోంది.