ప్రస్తుతం ఎవరు చూసిన ఉద్యోగాలు చేసుకొని కరోనా ను అంటించుకోడం కన్నా ఇంట్లో కూర్చొని సొంత బిజినెస్ లు చేసుకోవడం మంచిదని అంటున్నారు.. అందుకోసం బ్యాంకులను రుణాలను అడుగుతున్నారు. కొన్ని బ్యాంకులు రుణాలను ఇవ్వడం కన్నా కష్టమర్ల నుంచి బాదడం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటి నుంచి విముక్తి పొందాలంటే ఏ బ్యాంకులో రుణాలను తక్కువ వడ్డీకి ఇస్తున్నారో తెలుసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులలో ముఖ్యంగా వినిపించే పేర్లు ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఈ బ్యాంకులు కష్ట మర్ల నుంచి మంచి ఆదరణ పొందడానికి ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.



లోన్ తీసుకున్నపుడు వాటికి కడుతున్న ఈఎంఐ లు తక్కువ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఐదు లక్షలు తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి 8.95 శాతం వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. కాగా, నెలవారీ ఈఎంఐ రూ.10,367 అవుతుంది. ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.05 శాతంగా ఉంది. అంటే ఈఎంఐ రూ.10,391గా ఉంటుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వడ్డీ రేటు 9.6 శాతంగా ఉంది. ఇక్కడ ఈఎంఐ రూ.10,525గా పడుతుంది.



అలాగే యుకో బ్యాంకు లో వడ్డీ 10.05 శాతంగా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.10,636 అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ తీసుకుంటే నెలకు రూ.10,685గా ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేుట 10.75 శాతంగా ఉంది. అంటే ఈఎంఐ రూ.10,809 అవుతుంది. వీటితో పాటుగా మహారాష్ట్ర బ్యాంకు లో వడ్డీ 9.7 పడగ ఇక నెలకు రూ. 10,550 ఉంటుంది. ఇలా చెప్పాలంటే అన్నిటికన్నా మంచి ఆఫర్లు ఇచ్చేది మాత్రం ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మాత్రమే అని ఖాతాదారులు అంటున్నారు. మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం పైన తెలిపిన వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని తీసుకుంటే మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: