సాధారణంగా పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వారి బిల్లు జనరేట్ అయిన తర్వాత వారం రోజుల్లో ఆ బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రతి నెలా కట్టవలసి వస్తుంది.. అయితే ఇప్పుడు పేటీఎం మరో కొత్త ఆఫర్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. కస్టమర్లు వారి బిల్లు మొత్తాన్ని ఈఎంఐలోని మార్చుకోవచ్చు. ఇకపోతే పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కస్టమర్లకు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తోంది..
ఇలా చేయడం వల్ల కస్టమర్లకు మంచి ఆఫర్, సేవింగ్ తో పాటుగా నచ్చిన ప్రొడక్టులు కొనుగోలు చేయొచ్చు.
పేటీఎం పోస్ట్పెయిడ్ లో మూడు రకాలు ఉంటాయి. పోస్ట్పెయిడ్ లైట్ యూజర్లు రూ.20,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందుతారు. క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు పెటీఏం వెల్లడించింది. దీంతో ఇప్పుడు కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ఉండటం తో ఎక్కువ మంది పేటీఎం ద్వారా లావాదేవీలను చేస్తున్నారు..