గత కొంత కాలం నుంచి చాలా మంది ధనవంతుల సంపద కరిగిపోయింది.ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు అయితే చాలా విధాలుగా నష్టపోయారు. ఈ సంవత్సరం ముఖేష్ అంబానీకి అయితే ఏకంగా 20 శాతం సంపద పోయింది.అంటే ఏకంగా 21 బిలియన్ డాలర్ల సంపద ( దాదాపు 1.72 లక్షల కోట్ల రూపాయలు ) కోల్పోయారు.అయినా కూడా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో అతని స్థానం మాత్రం టాప్ -10 లోనే వుంది.ఇక M3M Hurun గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 ప్రకారం.. ముఖేష్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలోని 9వ అత్యంత సంపన్న వ్యక్తి .మొత్తం 21బిలియన్ల డాలర్ల సంపద కనుమరుగైనప్పటికీ అంబానీకి 82 బిలియన్ డాలర్ల (6.74 లక్షల కోట్ల రూపాయలు ) ఆస్తులు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది.ముఖేష్ అంబానీ చాలా సంవత్సరాల నుంచి భారతదేశం తరపున నంబర్ వన్ ధనవంతుడుగా కొనసాగుతున్నాడు. గత మూడు సంవత్సరాలుగా ఆసియాలో అత్యంత ధనవంతుడు అనే పేరు కూడా ఉంది. ఒక దశలో, గౌతమ్ అదానీ ఎంట్రీ ఇచ్చి ముఖేష్ అంబానీని అధిగమించి ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులలో ఒకరిగా నిలిచాడు.


జనవరి నెలలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అది గౌతమ్ అదానీకి పెద్ద షాక్ ఇచ్చింది.మొత్తం 35 శాతం ఆస్తులను కోల్పోయిన గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు 53 బిలియన్ డాలర్లుగా ఉంది (4.36 లక్షల కోట్ల రూపాయలు ). ప్రపంచ సంపన్నుల జాబితాలో గత సంవత్సరం 2వ స్థానంలో వున్నాడు గౌతమ్ అదానీ.ఇప్పుడు అతని స్థానం 23వ స్థానానికి పడిపోయింది.గత సంవత్సరం గౌతమ్ అదానీ సగటున రోజుకు రూ .1,600 కోట్లు సంపాదించారు. కిరాణా నుంచి సిమెంట్, విమానాశ్రయం, ఓడరేవు ఇంకా మైనింగ్ మొదలైన వాటి దాకా గౌతమ్ అదానీ వ్యాపారం విస్తరిస్తోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ చాలా వేగంగా ఎదుగుతున్న గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ కొట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల షేర్లు బాగా పతనమవుతున్నాయి. చైనా నుంచి 178 మంది ఇంకా అమెరికా నుంచి 123 మంది ఒక సంవత్సరంలో 1 బిలియన్ డాలర్ల విలువైన సంపదను కోల్పోయారు. ఈ లిస్టులో భారతదేశంలో 41 మంది సంపన్నులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: