ఆంధ్రాలో ఏం జరిగినా దానిని నెగిటివ్ కోణంలో చూపించాలని కంకణం కట్టుకొని కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రాకు పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదంటూ రోజూ వరుస కథనాలు ప్రచురిస్తున్న ఓ వార్తా పత్రిక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఓ సంస్థపై కూడా విష ప్రచారం మొదలు పెట్టింది. అదానీ ని ఓ ఆర్థిక నేరగాడిగా చూపిస్తూ ఆయన చేసే వ్యాపారలన్నింటిని కూడా సంఘ విద్రోహ కార్యకలాపాలుగా ప్రొజెక్ట్ చేస్తోంది. అదానీ చేసిన తప్పేంటంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టడం.


ఒకవేళ చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఇవే పెట్టుబడులు పెడితే ఆయన్ను చూపించే విధానం పూర్తిగా మారిపోయేది. ప్రపంచంలోనే అపర కోటీశ్వరుడిని ఏపీకి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే అనే కోణంలో వార్తలు ఉండేవేమో.. ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అనేలా వార్తలు ఉండేవి.


కానీ జగన్ అధికారంలో ఉండే సరికి ఈ క్రెడిట్ అంతా ఏపీ సీఎం కే వెళ్తోంది అనే ఉద్దేశంతో విషపు రాతలకు పూనుకుంది. వాస్తవానికి ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, గౌతమ్ అదానీకి సత్సంబంధాలు ఉన్నాయి. దీనికి సాక్ష్యమే అంబానీ మనిషికి జగన్ రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వడం. తెరవెనుక ఏం జరిగినా.. అంతిమంగా ఏపీకి లాభం చేకురిస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రమే మనం చూడాలి.


ఏపీలో గౌతమ్ అదానీ అనేక సోలార్ పెట్టుబడులు పెడుతున్నారు. జగన్ ఇండస్ర్టీలిస్ట్ అయితే చంద్రబాబు బిజినెస్ మ్యాన్. తాజాగా అదానీ బీచ్ సాండ్ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నారు. ఇది దేశానికి నష్టం అనే కోణంలో ఓ వార్తాపత్రిక కథనాలు ప్రచురిస్తోంది. ఇది భారతీయ కంపెనీ యే అనే విషయం మరచిపోతున్నారు. పెట్టుబడుతు పెడితే ఒక విధంగా పెట్టకపోతే మరోలా వార్తలు రాస్తున్నారు. మరోవైపు అదానీ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఎందుకింత అసహనం అనేది అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: