నేటి రోజుల్లో బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు. రోజురోజుకు ఏకంగా బంధాలను బంధుత్వాలను మరిచి దారుణం గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు నెపంతో జరుగుతున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కట్టుకున్న వారి కళ్లు గప్పి పరాయి వ్యక్తులతో మోజులో పడి చివరికి దారుణం గా వ్యవహరిస్తున్నారు ఎంతోమంది.  ఇక కట్టుకున్న వారిని మోసం చేసి చివరికి బలవుతున్నారు ఇంకెంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  భర్త వృత్తి రీత్యా దూరంగా ఉంటున్నాడు.



 ఈ క్రమంలోనే భార్య ఒంటరితనాన్ని తట్టుకోలేక పోయింది. ఇక అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఎన్నో రోజుల పాటు వివాహేతర సంబంధం కొనసాగింది. దీని గురించి ఊరంతా పాకిపోయింది.  చివరికి ఈ విషయం  సదరు మహిళ మరిది చెవిన పడింది.  ఓ రోజు మరిది స్వయంగా ఈ విషయాన్ని చూశాడు. దీంతో ఆగ్రహం పట్టలేక పోయిన సదరు వ్యక్తి ఏకంగా గొడ్డలితో తన వదిన ప్రియుడిపై దారుణంగా దాడి చేశాడు.  ఈ ఘటన స్థానికంగా అందరిని భయాందోళనకు గురి చేసింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.



 డిచ్పల్లి మండలం వెస్లీ నగర్  తండాలో బాదావత్ జ్యోతి అనే మహిళ తన మరిది,అత్తమామలతో కలిసి నివాసముంటుంది. భర్త వృత్తి రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన బాదావత్ పీర్ సింగ్ అనే వ్యక్తి తో జ్యోతి కి పరిచయం ఏర్పడింది.  ఈ క్రమంలోనే కొన్ని రోజుల్లోనే వీరి పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.  భర్త కూడా ఇంట్లో లేకపోవడంతో ఇక అడ్డూ అదుపూ లేకుండా అక్రమ సంబంధానికి కొనసాగించేవారు. ఇక ఓ రోజు ఆ నోటా ఈ నోటా పడి చివరికి జ్యోతి మరిది కి ఈ విషయం తెలిసింది. ఓ రోజు స్వయంగా జ్యోతి మరిది సంగేశ్ ఇక వీరి రాసలీలలు చూశాడు.  దీంతో ఆగ్రహం పట్టలేక పోయిన సదరు వ్యక్తి తన వదిన తోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా అంటూ గొడ్డలితో పీర్ సింగ్ తల పై వేటు వేశాడు.  ఇక గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: