భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే.. అవి ఏరోజుకారోజు పరిష్కరించుకుని కొత్తగా కాపురం సాగించాలి. లేకపోతే.. ఆ సంసారం నరకమే. అందులోనూ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంట ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భార్య అతి కిరాతకంగా హత్యే చేసిన తీరు ఒళ్లుగగుర్పొడుస్తోంది.

 

 

ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు చంపుతున్న ఘోరాలు కూడా బాగానే వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ ఘటన మరీ దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో కఠారి అప్పారావు, తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే వీరిద్దరూ కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

 

 

భార్యాభర్తలు ఇద్దరూ మద్యానికి బానిసలయ్యారు. దీంతో గొడవలు పెరిగాయి. కలకాలం కలిసి ఉందామని ప్రేమించి పెళ్లి చేసుకున్నా... వారి మధ్య మద్యం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య కలహాలు బాగా పెరిగాయి. ఇక లాభం లేదనుకున్న భార్య భర్తను చంపేందుకు నిర్ణయించింది. భర్త గాఢనిద్రలో ఉన్న సమయంలో నవ్వారు మంచానికి కట్టేసింది. గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసింది.

 

 

మరోవైపు అతడి మర్మాంగాలను కోసేసింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పారావు సోదరుడు నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య లక్ష్మి పోలీసుల ముందు లొంగి పోయింది. చేసిన నేరం అంగీకరించింది. ప్రేమతో ఒక్కటైన బంధం ఇలా.. విషాదంగా ముగియడం చర్చనీయాంశమైంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: