ఈ మధ్య కాలంలో అక్రసంబంధాలతో పచ్చని కాపురాలలో చిచ్చు పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కరి ప్రాణాలను మరొక్కరు తీసుకున్న సంఘటనలను కూడా చాలే చూశాము. ఇక దైవ సాక్షిగా భర్తతో తాళి కట్టించుకొని.. కన్నవారిని కాదనుకొని మెట్టినింట్లో అడుగుపెడుతుంది అమ్మాయి. ఇక నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తానని ప్రమాణం కూడా చేస్తుంది. కాగా.. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్త మరణ శాసనాన్ని కూడా ఓ భార్య రాసింది. ఇక కట్టుకున్న వాడినే కడతేర్చింది ఆ భార్య.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  భర్త ఉద్యోగానికి వెళ్లగానే ప్రియుడితో చాటింగ్ చేస్తున్న ఓ మహిళ.. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక వద్దని వారించిన భర్తతో గొడవ పడుతూ ఉండేది. అయితే చివరికి అతడ్ని చంపేసి ఓ నాటకం ఆడింది. ఇక అడ్డంగా బుక్కైంది ఈ మహిళ.

అయితే భర్త ఉండగానే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వప్నప్రియ తరచూ అతడ్ని ఏకాంతంగా కలుస్తూ ఉండేది. ఇక భార్య ప్రవర్తన, ఎప్పుడూ సెల్ ఫోన్లో మాట్లాడుతుండటం చూసి అనుమానించిన వాసు.. ఆమెను ప్రవర్తన మార్చుకోమని ఆమెను . ఈ విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. .

ఇక ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వప్నప్రియ... ఎలాగైనా అతడ్ని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. కాగా.. ఎవరికీ అనుమానం రాకుండా భర్త మెడ విరిచి హత్య చేసింది. ఆ తరువాత గుండెపోటుతో చనిపోయాడంటూ మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారి గ్రామానికి తీసుకొనిపోయింది.

కాగా.. వేరే ప్రాంతంలో ఉన్న వీరి కుమారుడు స్వగ్రామానికి వచ్చి తండ్రి మృతదేహంపై గాయాలుండటంతో అనుమానం వ్యక్తం చేశారు.  అయితే తన తల్లిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరం చేసినట్లు ఒప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: