ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది నేటి రోజుల్లో కేవలం ఒక చాక్లెట్ తిన్నంత ఈజీ గా మారిపోయింది. జాలి దయ అనేది లేకుండా మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు సాటి మనుషులు. దారుణంగా హత్యలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న దారుణమైన హత్యలు ఏకంగా సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. ముఖ్యంగా మనిషి ఆలోచన  లో వస్తున్న మార్పులు చూస్తుంటే వామ్మో రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో అన్నది కూడా అర్థం కాని విషయంగా మారిపోయింది.



 అయితే ఇతర దేశాల విషయం పక్కన పెడితే పాకిస్తాన్లో అయితే మరింత దారుణంగా ఉంటుంది పరిస్థితి. అక్కడ హత్యలు చేసినా పట్టించుకునే వారు తక్కువ. దీంతో చిన్న చిన్న విషయాలకే ఎంతోమంది దారుణంగా హత్యలకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటీవలే పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఒక దారుణమైన హత్య ఘటన కాస్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.  దేవుడిని దూషించాడు అనే కారణంతో శ్రీలంక జాతీయుడిని ఏకంగా నడిరోడ్డుపై సజీవ దహనం చేయడంసంచలనంగా మారిపోయింది. ఈ ఘటనపై అటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది.


 తమ దేవుడిని దూషించాడు అనే ఆరోపణలతో పాకిస్తాన్లో శ్రీలంక జాతీయుడు ప్రియాంత కుమార అనే వ్యక్తిపై ఓ మూక దాడి చేసి ఇక ప్రాణాలు ఉండగానే బహిరంగంగా దానం చేసింది. ఇక ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించారు అక్కడున్న వారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అయితే ఇక ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుల్లో ఎక్కువమంది  తెహ్రికి లబ్బాయిక్  పార్టీకి చెందిన మద్దత్తు దారులే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇక ఈ నిందితులపై ఎలాంటి శిక్షలు విధిస్తుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: