కోపం మనిషికి శత్రువు లాంటిది.. అందుకే కోపం వచ్చినప్పుడు ఎం చెస్తున్నారొ తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని నిమిషాల కోపం వల్ల అవతలి వాళ్ల ప్రాణాలను కూడా తీయడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మటన్ కోసం ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తిని కత్తితో పొడిచాడు. అనుకున్న తూకం కన్నా కూడా తక్కువ ఉండటంతో షాపు అతనితో వాగ్వాదానికి దిగాడు.. అతను అంతే వచ్చేది అనడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. దాంతో పక్కనే ఉన్న కత్తితో అతణ్ణి దారుణంగా హత్య చేశాడు.. ఆ ఘటన పూర్తీగా  మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ కార్యం కోసం వెళ్ళిన వ్యక్తికి మటన్ తక్కువ వెసారని గొడవకు దిగాడు. అది కాస్త పెద్ద గొడవగా మారింది.


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ కడప లో వెలుగు చూసింది.. కడప టౌన్‌కు చెందిన శివ, షేర్ ఖాన్ స్నేహితుల మధ్య ఓ ఫంక్షన్‌లో మాంసం ముక్కల కోసం గొడవ జరిగింది. తనకు షేర్ ఖాన్‌ ముక్కలు తక్కువ వేశాడని శివ ఘర్షణ పడ్డాడు. క్షణికావేశంతో షేర్ ఖాన్‌ను కత్తితో గాయపరిచాడు. అయితే అక్కడ ఉన్న వాళ్లంతా అడ్డుకోవడం తో గొడవ సర్దు మనిగింది. కాగా, షేర్ మాత్రం అతని పై కక్ష్య పెట్టుకున్నాడు.. ఓ రోజు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు.. అతను అది నిజమని నమ్మి వెళ్లాడు. అక్కడే ట్విస్ట్ జరిగింది.


అతను అక్కడికి వెళ్ళగానే గొడవ పడ్డాడు.  మాటా మాటా పెరగడంతో అతని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు..ఆవేశంతో ఊగిపోయిన షేర్ ఖాన్ కత్తితో శివ గొంతు కోసం హత్య చేశాడు. హత్యానంతరం తన స్నేహితుల సాయంతో శివ మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కేసీ కేనాల్ కాలువ పక్కన పడేశాడు. శివ హత్యపై కేసు నమోదు చేసిన కడప టూ టౌన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా మటన్ కోసం గొడవలు పడటం అందరికి ఆలోచనలొ పడవెసింది.. ప్రస్తుతం ఈ ఘటన    కలకలం రేపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: