ఏంటో నాగరిక సమాజంలో కూడా మనుషులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక వెనక ముందూ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు సంచలనంగా మారిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలకే మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేటి రోజుల్లో ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ భార్య భర్తే లోకంగా బ్రతికింది. వారి ప్రేమకు గుర్తుగా ఆరు నెలల క్రితమే ఒక కుమారుడు కూడా పుట్టాడు. వారి జీవితం మొత్తం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.


 కానీ విధి వీరి ఆనందాన్ని చూసి ఓర్వ లేక పోయింది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భర్త ప్రాణాలను తీసేసింది. ఇక భర్త మరణవార్త విన్న భార్య గుండె పగిలిపోయింది. భర్త లేని జీవితం నాకు వద్దు అని అనుకుంది. ఆరునెలల కుమారుడు గురించి కూడా ఆలోచించలేదు.  కఠినంగా ఆలోచించిన తల్లి ఆరునెలలు కుమారుడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. రాయచూర్ కు చెందిన గంగాధర్ బి కమ్మర, శృతి భార్య భర్తలు. వీరికి ఆరునెలల కుమారుడు అభిరాం ఉన్నాడు. మంగళూరు అగ్నిమాపక దళం లో గంగాధర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.


 ఇటీవలే గంగాధర్ రోడ్డు ప్రమాదం బారిన పడగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకు వచ్చిన కార్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే భర్త మృతి చెందిన విషయం భార్యకు  తెలిసి అరణ్యరోదనగా విలపించింది. ఒక్కసారిగా షాక్ కి గురైన ఆమె భర్త మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది.. రాత్రి సమయంలో తన ఆరు నెలల కుమారుడు అభిరామ్ ను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా కుటుంబం మొత్తం ఒక్కసారిగా ప్రాణాలు వదలడం తో స్థానికంగా ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: