సాధారణంగా పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు అందుకనే వెనక ముందు అన్ని చూసుకుని పెళ్లి బంధం లోకి అడుగు పెట్టాలని భావిస్తు ఉంటారు అందరు. ఎందుకంటే కలకాలం కలిసి ఉండే బంధం లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అయితే నేటి రోజుల్లో పెళ్లి అనే విషయాన్ని ఒక ప్రత్యేకమైన బందంగా కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్ లా చూస్తున్నారు జనాలు. దీంతో పెళ్లికి అసలు విలువ ఇవ్వకుండా ఒక్కరూ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆమెకు అది రెండో పెళ్లి. కాని ఈ విషయం యువకుడికి  తెలియదు. వీరి సంసారం  ఎంతో సాఫీగా సాగిపోయింది. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఏడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. కానీ అంతలో భార్య ప్రవర్తన లో మార్పు వచ్చింది. ఇంట్లో పనులు చేయకుండా ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతూ వచ్చింది భార్య. కొన్నాళ్ళకి భర్త ఇది గమనించాడు భార్యను మందలించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తల్లి పట్టించుకోకపోవడంతో కుమారుడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఈ విషయం భార్య తరపు బంధువులు దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టించాడు. అప్పుడే అతనికి అసలు విషయం తెలిసింది.


 తన భార్యకు అంతకుముందే వేరొక వ్యక్తితో పెళ్లి అయిన విషయం తెలియడంతో కొత్త గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త పై కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. చివరికి రెండో భర్త ను కూడా వదిలేసి మూడో వ్యక్తి ని పెళ్లి చేసుకుంది.ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 32 విజయ్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తుండగా.. విద్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయింది. విషయం విజయ్ కి తెలియదు.. చివరికి ఈ దంపతులకు  బాబు కూడా ఉన్నాడు. ఇటీవల భార్య భార్య సెల్ఫోన్ ఎక్కువగా వాడటంతో  అనుమానం వచ్చిన భర్త పంచాయితీ పెట్టించాడు.  ఆ సమయంలోనే భార్యకు మరో పెళ్లి జరిగింది అన్న విషయం తెలిసింది వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. అయితే భర్త పై కోపంతో వెళ్లిపోయిన యువతి మరో పెళ్లి చేసుకుంది. ఎవరికి తెలియకుండా రహస్యంగా అతనితో  కాపురం పెట్టింది.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: