వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న అమానవీయ ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో సభ్య సమాజం తీరు ఎటు పోతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు . ఇక్కడ మరో దారుణ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా మృతదేహానికి తాడుకట్టి ఈడ్చుకెళ్ళిన అమానవీయ ఘటన ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. బెగుసరాయ్ ప్రాంతంలోని లాకో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు స్థానికులు. ఈ క్రమంలోని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.. ఇక ఇద్దరు వ్యక్తులు మృతదేహం కాలికి తాడు కట్టి నేలపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకువెళ్లారు.. అనంతరం ట్రాక్టర్ లో ఎక్కించి స్థానిక ఆసుపత్రికి తరలించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఇది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఒక మనిషి మృతదేహాన్ని జంతు కలేబరంలా లాక్కెళ్లడం ఏంటి అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అమానవీయంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అటు పోలీసులను డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.