ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. కొంత మంది దొంగలు ఇళ్లల్లో కన్నాలు వేస్తూ ఉంటే.. కొంత మంది దొంగలు ఏకంగా బ్యాంకులకు కన్నాలు వేసి లైఫ్ లో సెటిల్ కావాలని భావిస్తున్నారు. మరికొంతమంది దుకాణాలలో కూడా దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకో పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ  దొంగల బెడద మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అనేది తెలుస్తుంది.


 అదేసమయంలో ఇటీవల కాలంలో చోరీలకు వెళుతున్న కొంతమంది దొంగలు విచిత్రమైన పనులు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నారు అని చెప్పాలి. దొంగతనం చేయడానికి వెళ్లిన వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. చీమ చిటుక్కుమన్నా కూడా గమనిస్తూ ఉంటారు.  చోరీకి వెళ్ళినప్పుడు డబ్బు లేకపోతే విలువైన వస్తువులు చోరీ చేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం దొంగలు కేక్ కట్ చేసుకుని పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 సాయిరాం స్వీట్స్ అండ్ బేకరీ షాప్ లో అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. డబ్బు  కోసం వెతికితే దొరకలేదు.. దీంతో విచిత్రంగా ప్రవర్తించి.. షాప్ లో ఉన్న కేకలను చూసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఇంకేముంది ఫ్రీజర్ లో ఉన్న కూల్ కేక్  లలో తమకు ఇష్టమైన వాటిని తిన్నారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉదయం షాప్ దగ్గరికి వచ్చిన యజమాని అక్కడ జరిగింది చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు.  దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. 20 వేల రూపాయల స్వీట్లు  మాయమయ్యాయి అని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: