ప్రపంచ ఎంతో అభివృద్ధి చెందుతోంది అని మురిసిపోతున్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు మరియు దేశ ప్రభుత్వాలకు కొన్ని విషయాలు దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొందరు ఈ టెక్నాలజీని మంచి పనుల కోసం, తమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటే.. మరికొందరు ఇతరుల నాశనానికి మరియు క్రైమ్ లు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనము ప్రతిరోజూ ఎన్నో సంఘటనల గురించి వింటూనే ఉంటాము. కాగా గత మూడు రోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగిన ఒక హత్య కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య చేసింది ఎవరు అన్నదానికి చిక్కుముడి వీడింది. ఈ కేసులో ఇద్దరు స్నేహితులు మరియు ఒక అమ్మాయి పాత్రధారులు... మణికంఠ మరియు శంకర్ లు కూకట్ పల్లి లో  చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు.

అయితే శంకర్ కు ఒక లవర్ ఉంది... ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఆటోమేటిక్ గా మన లవర్స్ గురించి ఫ్రెండ్స్ కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా శంకర్ తన లవర్ గురించి మణికంటకు చెప్పడం మరియు పరిచయం చేయడం జరిగిపోయాయి. అయితే మణికంఠను ఫ్రెండ్ లాగే అనుకున్న ఆ అమ్మాయి సరదాగా మాట్లాడేది. కానీ ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న మణికంఠ తనను ఎలాగైనా లొంగదీసుకోవాలని ట్రై చేశాడు. ఆ క్రమంలో తనకు బూతు మెసేజ్ లు చేశాడు. అయితే ఇలా మెసేజ్ లు చేయవద్దని చాలాసార్లు అమ్మాయి చెప్పినా వినకుండా పదే పదే ఇబ్బంది పెట్టడంతో, ఆ అమ్మాయి తన లవర్ శంకర్ కు విషయాన్ని చెప్పింది. దీనితో తట్టుకోలేని శంకర్ మణికంఠను చంపేయాలని ప్లాన్  చేసాడు.

గత శుక్రవారం ఇద్దరు బాగా మందుతాగి మాటల్లో ఈ మెసేజ్ ల గురించి అడిగాడు... ఇక ఇద్దరూ మత్తులో ఉండడంతో మాటా మాటా పెరిగి శంకర్ మణికంఠను బీరు బాటిల్ తో కొట్టి చంపేసి, అక్కడి నుండి పారిపోయాడు. అలా స్నేహానికి శంకర్ సమాధి కట్టాడు, ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ మరణం గురించి తెలుసుకున్న పోలీసులు శంకర్ మణికంఠలు కలిసి తాగారు అన్న విషయాన్ని తెలుసుకుని అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: