
ఇలా వరుసగా ఎంతో మంది విద్యార్థులు వేధింపులకు గురవుతూ మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతుంది అని చెప్పాలి. యువకుడు మోసం చేశాడు అన్న కారణంతో ఉషారాణి అనే విద్యార్థి చివరికి బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు అరణ్య రోదనను మిగిల్చింది అని చెప్పాలి.
ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ కు చెందిన ఉషారాణి ఒక యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు మాత్రం ఇక అన్ని విధాలుగా అవసరాలు తీర్చుకొని చివరికి ముఖం చాటేసాడు. దీంతో ఇక యువకుడి చేతిలో మోసపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినా ఉషారాణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఉషారాణి హుజురాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఒకేషనల్ కోర్స్ చదువుతూ ఉంది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మాత్రం సంచలనంగా మారిపోతు ఉన్నాయి అని చెప్పాలి.