![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/crime/135/dogsbab08e1c-f49b-462f-a80c-7032334a974b-415x250.jpg)
దీంతో ఎక్కడైనా వీధి కుక్క కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి గుండె జారిపోయినంత పని అవుతుంది. ఇక అటువైపుగా వెళ్లడానికి కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు అని చెప్పాలి. అయితే మొదటికే మొన్న హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ని కుక్కలు దారుణంగా చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటన గురించి మరవకముందే తెలంగాణలోనే మరికొన్ని కుక్కల దాడికి సంబంధించిన ఘటనలు వెలుగు చూసాయ్.
అయితే తెలంగాణలో మాత్రమే కాదు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో సైతం ఇలా కుక్కల బెడద తీవ్రంగానే ఉంది అన్నది అర్థమవుతుంది. మొన్న అంబర్పేట్ లో జరిగిన ఒక దారుణమైన ఘటనలాంటిదే ఇక ఇప్పుడు రాజస్థాన్లో కూడా జరిగింది. ఏకంగా ఒక నెల వయసున్న పసికందును వీధి కుక్కలు అత్యంత కిరాతకంగా కరిచి చంపేసాయి. సిరోహి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరు లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును ఏకంగా రెండు కుక్కలు ఎత్తుకు వెళ్లాయి. ఇక రాత్రి రెండు గంటల సమయంలో తల్లి నిద్ర నుంచి మెలకువ వచ్చి చూసేసరికి కూతురు కనిపించలేదు. బయటికి వచ్చి చూస్తే.. కుక్కలు కరుస్తూ ఉండడం కనిపించింది. వెంటనే ఆ కుక్కలను అక్కడ నుంచి తరిమేసిన అప్పటికే తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.