ఇటీవల కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు పోతుంది అన్న విషయంపై కూడా క్లారిటీ లేకుండా పోయింది అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే కొన్ని విషాదకర ఘటనలు గురించి తెలిసిన తర్వాత నిజంగా ఆ దేవుడికి దయలేదేమో అని ఎంతో మందికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని ఘటనల్లో అయితే ఎంతో మంది చిన్నారులు ఏకంగా తల్లిదండ్రులను కోల్పోయి విషాదంలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి



 ఇక ఇలాంటి విషాదకర ఘటనలు ప్రతి ఒక్కరి మనసును ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయింది అనే విషయం తెలియక ఒక చిన్నారి బాలుడు ఏకంగా తల్లి మృతదేహం పక్కనే రెండు రోజులపాటు గడిపాడు. హృదయాలను మెలిపెట్టేస్తున్న ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది అని చెప్పాలి. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి నిద్రపోతుందని భావించి 11 ఏళ్ల బాలుడు తల్లి శవం పక్కనే రెండు రోజుల పాటు గడిపాడు.



 ఆర్ టి నగర్ లో నివాసం ఉంటున్న అన్నమ్మ అనే 44 ఏళ్ల మహిళ కొంతకాలంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ అనే ఆరోగ్య బాధపడుతూ ఉంది.  అయితే ఇటీవల నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది అన్నమ్మ. అయితే ఇక ఆమెకు 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇక ఆ బాలుడు ప్రతిరోజు స్నేహితులతో బయటికి వెళ్లి ఆడుకొని ఇక వారితో పాటే భోజనం చేసి వస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల ఓ రోజు స్నేహితులతో ఆడుకుంటూ.. మా అమ్మ రెండు రోజులుగా నాతో మాట్లాడట్లేదు. ఎప్పుడు చూసినా  నిద్రపోతూనే ఉంది అంటూ స్నేహితులతో చెప్పాడు. దీంతో వారు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఆ బాలుడు ఇంటికి వెళ్లి చూస్తే మహిళ మృతి చెందింది. దీంతో అక్కడ కనిపించిన దృశ్యంతో అందరూ ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: