నేటి సభ్య సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత  సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో ఆడపిల్ల వంటింటి కుందేలుగా ఉండడం లేదు అన్ని రంగాల్లో రాణిస్తుంది. పురుషులకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ చెబుతూ ఉన్నారు. కానీ ఎందుకో కొంతమంది కామాంధులు  మాత్రం.. మహిళలను ఎప్పటికీ వెనక్కి లాగుతూనే ఉన్నారు. ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాడిలో ఉన్న మృగాడు బయటికి వచ్చి చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 ఆడపిల్లలను వేధింపులకు గురి చేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు అని చెప్పాలి. దీంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది రాక్షసులు అయితే అత్యాచారం చేసి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల యూపీలోని కాన్పూర్ లో కూడా ఇలాంటి ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది.


 దీంతో అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఇద్దరు బాధ్యత బాలికలు చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అయితే కూతుర్లు పోయిన బాధను తట్టుకోలేకపోయిన బాలిక తండ్రి చివరికి చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అయితే బాధిత బాలికలు కూడా ఒక ఇటుక బట్టిలో పనిచేసేవారు. ఇటిక బట్టి కాంట్రాక్టర్ అతని అనుచరులు కలిసి 14, 16 ఏళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే కేసు పెట్టి న్యాయం కోసం పోరాడే స్తోమత లేదు. ఇటుక బట్టి ఈ కాంట్రాక్టర్ ని ఎదిరించే ధైర్యం లేని చిన్న జీవితాలు ఆ బాధితులవి. ఇక చుట్టుపక్కల వాళ్ళు అత్యాచారం గురించి మాట్లాడుతూ సూటిపోటి మాటలు అంటుంటే ఆ బాలికలు తట్టుకోలేకపోయారు. చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు  చాలించారు. ఇక ఇప్పుడు బాలికల తండ్రి కూడా చివరికి సూసైడ్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: