ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక నేటి సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి ఏదైనా ప్రమాదం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఏకంగా సాటి మనుషుల విషయంలో మృగం కంటే అత్యంత రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తేనే.. ఇక వేధింపులకు పాల్పడేందుకు ధైర్యం చేసేవారు కామాంధులు. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లల పక్కన ఇంటి సభ్యులు ఉన్న వారిని బంధించి మరి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అయితే కేవలం ఆడపిల్లలను మాత్రమే కాదు మగవారిని కూడా వదలడం లేదు కామందులు. ఏకంగా పెద్దవారి దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు మగవారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఓ దారుణమైన ఘటన గురించే. అసహజమైన శృంగారానికి అంగీకరించలేదు అన్న కారణంతో 44ఏళ్ల వ్యక్తిని ఏకంగా మిత్రులు దారుణంగా కొట్టి చంపేసారు. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. మురళీధర్, సురేంద్ర, బైరవ కలిసి ఒకే చోట మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో  మురళీధర్, సురేంద్ర ఇద్దరూ కలిసి భైరవ పై లైంగిక దాడికి దిగారు. కానీ అతడు మాత్రం ప్రతిఘటించటంతో  మధ్యమత్తులోనే అతన్ని చంపేసి చెరువులో పడేశారు. అయితే మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు చివరికి కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఇక మరొకరు భయంతో సూసైడ్ ఎటెంప్ట్ చేయగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: