ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా.. లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ మనిషిలో ఉన్న విచక్షణ జ్ఞానం మాత్రం పూర్తిగా కనుమరుకైపోయిందేమో అనే భావన కలుగుతుంది. ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవాడు మనిషి. కానీ ఇప్పుడు.. ఏకంగా అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే అత్యంత రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.


 అయితే పరాయి వాళ్ళ విషయంలో మాత్రమే కాదు సొంత వారి విషయంలో కూడా అంతకంటే కసాయిగా వ్యవహరిస్తూ ఉన్నాడు మనిషి. ఏకంగా కట్టుకున్న వారిని కడుపున పుట్టిన వారిని అని కూడా చూడకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. అయితే సొంతవారే ఇలా ప్రాణాలు తీస్తూ ఉండడంతో.. అందరూ ప్రతి క్షణం భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఇక ఇటీవల యూకే లో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది   ఏకంగా కట్టుకున్న భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త ఆమెను దారుణంగా చంపేసాడు.


 నికోలస్ మోడిసన్ అనే వ్యక్తి భార్య హోలీ బ్రూంలీని దారుణంగా చంపేయడమే కాదు.. ఆమె శరీరాన్ని 224 ముక్కలు చేశాడు. అయితే ఆ భాగాలను కవర్లలో చుట్టేసి చివరికి నదిలో పడేసాడు  గత ఏడాది మార్చిలో ఈ దారుణ ఘటన జరుగా బ్రాంలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారింది. అయితే పోలీసుల విచారణలో భార్యను ఎందుకు చంపాడు అనే విషయంపై కారణాలు వెల్లడించలేదు నిందితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: