గతంలో భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి రెండు దేశాలు ప్రయత్నించాయి ఒకటి పాకిస్తాన్ అయితే రెండవది టర్కీ. ఇప్పుడు మళ్లీ ఈ రెండు దేశాలు కలిసి కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలోని మానవ విభాగం దగ్గర లేవనెత్తి కాశ్మీర్ లో మైనార్టీలకు హక్కులు పోతున్నాయి, అక్కడ మైనార్టీలు అన్యాయం అయిపోతున్నారు, ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక ఊకదంపుడు ఉపన్యాసం మాట్లాడారు కానీ అక్కడ దర్జా గా బ్రతుకుతుంది ముస్లిములు అయితే చచ్చిపోతుంది మాత్రం హిందువులన్న వాదన ఉంది. ఆ రెండు దేశాలు చంపుతుంది ముస్లిములని, ముస్లిం తీవ్రవాదులని మాత్రం చెప్పడం లేదు.


అక్కడ దర్జాగా బ్రతుకుతున్నది ముస్లింలు ఇంకా ప్రాణాలు చేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నది హిందువులంటున్నారు. కానీ ఐక్యరాజ్యసమితిలో వీటి గురించి మతాలవారీగా చెప్పడం లేదు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రపంచాన్ని వంచించే మాటలు చెబుతుంది. టర్కీ కూడా పాకిస్తాన్ కి వంత పాడుతుంది. ఇప్పుడు భారతదేశం ఈ ఇద్దరికీ కూడా ఘాటుగా సమాధానం చెప్పింది. పాకిస్తాన్ ఇంకా టర్కీ దేశాల ఉపన్యాసాల తర్వాత భారతదేశంలో రైట్ టు రిప్లై అంటే ఎదుటివాడు ఒక దేశం మీద ఇరిగేషన్ చేస్తే దానికి రిప్లై ఇచ్చే అధికారం ఉంటుంది.


తీవ్రమైన ఆగ్రహావేశాలతో భారత్ పరువు కావాలని తీయడానికి కుట్ర పన్నుతున్నాయి పాకిస్తాన్ ఇంకా టర్కీ దేశాలు. భారతదేశం మాట్లాడుతూ మీ టర్కి దేశంలో  మైనార్టీలు అయిన  క్రైస్తవుల పరిస్థితి ఏంటి అక్కడ చివరికి ప్రార్థనా స్థలాలను కూడా మార్చివేసేస్తున్నారు టర్కీ వాళ్ళు. పాకిస్తాన్ అయితే వేరే మతాల వాళ్ళని  హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
 

అదేంటంటే మైనార్టీల మీద దైవ ద్రోహం కేసులు పెట్టి జైళ్ళలో వేసి, రాళ్లతో కొట్టి మరీ చంపేస్తున్నారు. ఆలయాలను కూడా కూల్చేస్తున్నారు. అట్లాంటి ఈ రెండు దేశాలు కలిసి భారతదేశానికి హితబోధ చేయడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని ఐక్యరాజ్యసమితి వేదికగా తేల్చి చెప్పింది భారతదేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: