ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరునెల క్రితం  మీటింగ్ పెట్టినప్పుడు అందరు ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు 60, 70 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అన్నాడు, పబ్లిక్ లో తిరగమన్నాడు అన్నటువంటిది అప్పుడు ఆ మంత్రులు లోనే చర్చనీయాంశమయింది. ఆ తర్వాత 60, 70 మంది నుండి 50 మంది, 40 మంది, 30 మంది ఇంకా ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేల పేర్లు మీద మీడియా ఫోకస్ చేస్తుంది. అలా పనితీరు బాగా లేని వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది మీడియా. దీని గురించి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీకులు ఇచ్చి ఉండవచ్చు అని వినిపిస్తుంది.


ఈ 15 మంది పేర్లలో సిబిరి అప్పలరాజు, కంబాల జోగులు, సంపంగి అప్పలనాయుడు, అదీప్ రాజు, ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు, గొల్ల బాబురావు, పీవీ విశ్వరూప్, ఆళ్ళ నాని, మెరుగె నాగార్జున, మద్దిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, కందూరు నాగార్జున రెడ్డి, బుర్ర మధుసూదన్ యాదవ్, శెట్టిపల్లి రఘురామారెడ్డి, తిప్పే స్వామి, మడగసర, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, వేమూరు, ఏలూరు, అమలాపురం, పాయకరావుపేట, మైదుకూరు, ఎలమంచిలి, పెందుర్తి, బొబ్బిలి, రాజం, పలాస ఈ 15 సీట్లకు సంబంధించి మీడియా ఫోకస్ చేస్తుంది.


ఇది జగన్ ట్రాప్ అన్నది కూడా ఒక పక్కన వినిపిస్తున్న సందేహం. ఎందుకంటే తనే ఒక పక్కన తన వాళ్ళను బాలేదని చెప్పి ఆ తర్వాత బాగుపడిపోయారు అని చెప్తే జనంలోకి జగన్ మాట ఒక పాజిటివ్ సంకేతంగా వెళుతుందనేది ఆయన స్ట్రాటజీ ఏమో అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో అలా జనంలోకి ఒక పాజిటివ్ సంకేతాలు తీసుకువెళ్తే అప్పటివరకు ఆ ఎమ్మెల్యేల మీద జనాలకు ఉన్న  ఉన్న నెగెటివిటీ కొంతవరకు మారి ఆ నాయకులపై తిరిగి నమ్మకం కలిగే అవకాశం ఉంటుందని ఆ రకంగా జగన్ ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా వినిపిస్తున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: