పాకిస్తాన్ కి ఇండియా మీద ఉన్న అక్కసు తెలిసిందే కదా. అది కూడా అంతా ఇంతా ఉండదు దానికి. పాకిస్తాన్ కి ఏం ప్రాబ్లం వచ్చినా దానికి కారణం భారత దేశం అనే అంటారు వాళ్లు. అసలు ఆ ప్రాబ్లం తో భారత్ కి సంబంధం ఉన్న లేకపోయినా సరే. పాకిస్తాన్ లో రాజకీయ పరిస్థితులు బాగోక పోయినా  దానికి భారతే కారణం అంటారు. అక్కడ వ్యాపారం దెబ్బతింటే దానికి కారణం భారతే అంటారు.


అక్కడ ఎవరైనా ఎదగక పోతే అంటే అభివృద్ధి చెందకపోయినా దానికి కారణం భారత్ అనే అంటారు‌ చివరికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయినా దానికి భారత్ కారణం అంటారు. ఇలా పాకిస్తాన్ వాళ్ళు భారత్ ను బూచిగా చూపించి బ్రతికేస్తూ ఉంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మన వాళ్ల తప్పు ఉన్న లేకపోయినా మనదే తప్పు అంటూ ఉంటారు. చివరికి వాళ్ళ అన్నం తింటూ కూడా మనల్నే తిట్టుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సమావేశాల్లో పాకిస్తాన్ ఇదే తరహా ధోరణి ఫాలో అయితే, దానికి భారత్ బలంగానే బదులు చెప్పింది.


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ పాకిస్థాన్‌పై విరుచుకుపడింది.  పాకిస్థాన్‌పై భారత శాశ్వత రాయబారి స్పందిస్తూ ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలపై స్పందించేందుకు కౌన్సిల్‌ సమయాన్ని వృథా చేయబోనని అన్నారు.  కౌన్సిల్ కూడా నెలలో కౌన్సిల్ యొక్క రష్యన్ అధ్యక్షుడి అధ్యక్షతన సమర్థవంతమైన బహుపాక్షికత గురించి చర్చించారు.


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీదన లేదంటే, చొరబాటు దారుల వ్యవహారాల మీదన, లేదంటే ఇతర దేశాల కుట్రల మీద చర్చలు జరుపుతుంది రష్యా. ఆ చర్చలో పార్టిసిపేట్ చేసి పాకిస్తాన్ మాట్లాడితే ఆ విషయాన్ని మన భారతదేశ ప్రతినిధి చెప్పింది ఏంటంటే వాళ్ళు 24 గంటలు మన గురించి మాట్లాడుకుంటారు కాబట్టి పట్టించుకోవడం అనవసరం  అని అన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: