పలు ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్లు ఇతర సాంకేతిక సంబంధిత సామాగ్రి మెయింటెనెన్స్ అనేది లేక మూలన పడ్డాయి. దీంతో విద్యార్థులు బేసిక్ కోర్స్ అనేది నోచుకోని పరిస్థితి నెలకొంది. నిజానికి పిల్లలు ఆడియో విజువల్ తరహాలో నేర్చుకునే విద్య ఎక్కువ కాలం పాటు వారికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే గతంలో టీచర్లకు సైతం కంప్యూటర్ శిక్షణ ఇచ్చి విద్యార్థులకు ఉచితంగా బోధించాలనే నిబంధనని పెట్టారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విధి విధానాలను కూడా రూపొందించారు. కానీ గత కొంత కాలం నుండి ఈ పద్ధతి బోధనలో అవాంతరాలు అనేవి ఏర్పడుతున్నాయి.ఇక జిల్లాలో మొత్తం 650 పాఠశాలల్లో 49 వేల 754 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మొత్తం 149 ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 2006 వ సంవత్సరంలో కంప్యూటర్ శిక్షణ ను కూడా ప్రారంభించింది. మొత్తం 11 కంప్యూటర్లతో పాటు ఇతర సామాగ్రి తో కూడిన ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది. వీటి నిర్వహణ మొత్తం కూడా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా కంప్యూటర్ బోధించడానికి ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అయితే 2013 వ సంవత్సరంలో ఈ సిబ్బందిని తొలగించడంతో ఈ శిక్షణ కార్యక్రమం ఆగిపోయింది.


ఇక దాదాపుగా తొమ్మిది ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆయా కంప్యూటర్ల నిర్వహణ గురించి గానీ శిక్షణ గురించి గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తం 149 స్కూళ్లలో 981 కంప్యూటర్లు ఏర్పాటు చేసినా కూడా ఉపయోగం మాత్రం సున్నా.. ఇక కొన్ని స్కూల్ లో ఉన్న కంప్యూటర్లు అయితే వాటి విడి భాగాలు లెక్కల్లో మాత్రమే మిగిలాయి. దాదాపుగా సగానికి పైగా కూడా సిస్టమ్స్ పని చేయడం లేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఒక గొప్ప ఆశయంతో ప్రారంభమైన ప్రభుత్వ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ పథకం లక్ష్యం చేరకుండా మధ్యలోనే ఇలా నిలిచిపోయింది.ఇక నిజానికి ఇంత పెద్ద ఎత్తున కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో పథకం ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.


కానీ ఇక ఎంఈఓ కార్యాలయంలోని ఐఎంఎస్ కోఆర్డినేటర్లు పాఠశాలలోని కంప్యూటర్లకు రిపేర్ చేయగలిగే బేసిక్ లెవల్ ట్రైనింగ్ అప్పటికే విద్యాశాఖ ఇచ్చింది. ఇలాంటప్పుడు ఉన్నతాధికారులు సరైన సమన్వయంతో బాగా దూర దృష్టితో ఆలోచించి.. కంప్యూటర్ శిక్షణని పునరుద్ధరిస్తూ ఈ టెక్నాలజీ యుగంలో ప్రభుత్వ విద్యార్థులు సైతం బాగా దూసుకు పోగలరు. అంతులేని ఉపాధి అవకాశాలు ఉన్న కంప్యూటర్ శిక్షణ కనీస జీత భత్యాలతో కూడిన ఉద్యోగానికి సోపానం అని పలుమార్లు కూడా నిరూపితమైంది. కాబట్టి ఇక మన భవిష్యత్ తరాలకు ఈ విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: