దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషనలలో ఉన్న సుమారు 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న సుమారు 8000 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి గాను నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ  ఆర్మీ పబ్లిక్ స్కూల్ భాద్యతలని నిర్వహిస్తుంది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for army public school

మొత్తం పోస్టుల సంఖ్య : 8000 ఇందులో టిజిటి, పిజిటి, పీఆర్టీ కలిగి ఉంటాయి

ఎంపిక విధానం : ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ,టీచింగ్ స్కిల్స్ , కంప్యూటర్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.  ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు స్కూల్స్ ప్రకటన కు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ , పీజీ , బీఈడీ రెండేళ్ల డిప్లమోలలో  ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు :  గరిష్ట  వయో పరిమితి 40  ఏళ్లకు మించరాదు అయితే 5 ఏళ్ళ  బోధన అనుభవం ఉన్నవారికి గరిష్ఠ వయోపరిమితి 57 ఏళ్లు ఉంటుంది
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ :  22 – 9 - 2019
దరఖాస్తు ఫీజు : రూ. 500
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు  : విజయవాడ ,హైదరాబాద్ , సికింద్రాబాద్
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ : అక్టోబర్ నెలలో 19, 20 -2019 లలో జరుగుతాయి
ఫలితాలు వెల్లడి తేదీ : 30 -10 -  2019

మరిన్ని వివరాలకోసం : http://aps-csb.in


మరింత సమాచారం తెలుసుకోండి: