
హైదరాబాద్లో ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఈ ఐడీసీలో తొలి ఏడాదే సంస్థ 1,200 మంది నిపుణులను నియమించుకోనున్నది.హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్ ఇంకా అలాగే హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్లు ఇంకా ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీకి చెందినవే.
అలాగే గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను రెడీ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. ఇక మంత్రి కేటీఆర్ తో జరిగిన భేటీలో తమ విస్తరణ ప్రణాళికలపై ఆ సంస్థ ప్రతినిధులు చర్చించడం జరిగింది. ఇక ఇండియాలో తమ మార్కెట్ ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్ మెంట్ సెంటర్ ను కూడా ప్రారంభిస్తున్నామని అలెగ్జాండ్రా తెలిపారు. మొదటి సంవత్సరం ఏకంగా 1200 మందికి ఉపాధి కల్పిస్తామమని, వ్యాపారం పెరిగేకొద్ది మరింతమందికి కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ పెట్టుబడి ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీకి ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు