పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రెకులు పడ్డాయి. ఈరోజు మార్కెట్ లో భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం పది గ్రాములపై 300 రూపాయలు తగ్గింది. బంగారం తగ్గితే,మార్కెట్ లో వెండి కూడా అదే దారిలో కొనసాగుతోంది.. వెండి కిలో పై 1100 పైగా తగ్గింది. ఇక అంతర్జాతీయ పసిడి ధరలు పరుగులు పెట్టాయని తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


హైదరాబాద్ మార్కెట్ లో గురువారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 51,600కు దిగి వచ్చింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. పసిడి రేటు రూ.300 తగ్గుదలతో రూ. 47,300వద్ద కొనసాగుతోంది.. బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1100 పడిపోయింది. దీంతో సిల్వర్ రేటు రూ. 72,300కు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరలను పరిసీలిస్తే..బంగారం ధర జిగేల్ మంది. ఔన్స్‌కు 0.92 శాతం పైకి చేరింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1926 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 2.25 శాతం పెరుగుదలతో 25.26 డాలర్లకు చేరింది.. పసిడి ధరలు మార్కెట్ లో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు పలు అంశాలు బంగారం ధరల పై ప్రభవాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: