ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.ఇక ఈ వేడుక ప్రారంభించి శతాబ్దం దాటింది. దీనికి పునాది 1908 వ సంవత్సరంలోనే పడినా, 1975 వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది.ఇక నేడు అధికంగా ఊదారంగును ధరిస్తారు.ఎందుకంటే ఊదారంగు న్యాయానికి, గౌరవానికి ప్రతీక. ఇది ఆకుపచ్చ ఆశాదృక్పథాన్ని సూచిస్తుంది.అయితే ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు తగ్గ గౌరవం, గుర్తింపునిస్తోంది. ఈరోజు మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవం. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో ఈ దినోత్సవం భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ రోజుని జరుపుతారు.


ప్రముఖ మానవహక్కుల ఉద్యమకారిణి ఇంకా నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు గాను లాస్ ఏంజిల్స్ నగర మేయర్, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో  కలిసి బాగా కృషిచేశారు. 1994 వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా ఈరోజుని ప్రత్యేకమైన రోజుగా సాకారం చేశారు.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో  మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. అలాగే కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను ఈ రోజున ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: