దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి బారిన చిన్న పిల్లలు పడకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా పనిచేసే ఆహారాలేంటో ఒక్కసారి చూద్దమా. ఇక సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో విటమిన్-డి, జింక్. సెలినీయం, విటమిన్-ఈ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇది ప్రోటీన్లకు మంచి వనరు. శిశువుల్లో శక్తిని అందించి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

అయితే సాల్మన్ చేపలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది నొప్పిని నివారించి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉండే ఆహారం బాదం. రోజూ ఉదయాన్నే కొన్ని బాదం గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని పిల్లలకు స్నాక్స్ రూపంలో అందిస్తే మంచిది. అధికబరువు తగ్గడంలోనూ బాదం గింజలు తోడ్పడుతాయి.

అంతేకాదు పిల్లలకు సులభంగా జీర్ణమై మంచి చేకూర్చే ఆహారం పెరుగు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా వేడిని కూడా తగ్గిస్తుంది. చక్కెర లేకుండా పెరుగును పిల్లలకు తినిపించేలా జాగ్రత్త పడండి.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం బెర్రీలు. ఇవి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. సులభంగా జీర్ణమయ్యే ఈ ఆహారం మంచి డైట్ గాను ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడి తింటారు.

ఇక పిల్లలకు ఇచ్చే ఆహారాల్లో బ్రకోలి అత్యంత ఆరోగ్యకరమైంది. అంతేకాకుండా పోషకాలకు పవర్ హౌస్ గా పనిచేస్తుంది. ఫలితంగా చిన్నపిల్లల్లో ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.  ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర విలువైన పోషకాలు కూడా పుష్కలంగా దొరుకుతాయి. చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం కావడంతో పాటు రోగకారక క్రిములను నిరోధించడంలో ఓట్ మీల్ సహాయపడుతుంది. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: