ప్రస్తుత కాలంలో వైఫై వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొబైల్ ను వినియోగించే ప్రతి ఒక్కరూ వైఫై యొక్క సేవలను కచ్చితంగా వినియోగించుకుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తం డేటా ఉపయోగించుకోవాలని భావించే వాళ్లకు వైఫై బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం సైతం డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైలు ప్రయాణికులలో చాలామందికి ఫ్రీ వైఫై సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అయితే తాజాగా రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశంలోని 6115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హై  స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు  వెల్లడించారు.  ఈ సేవల ద్వారా సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.

రైల్వే స్టేషన్ పరిసరాలలో ఆఫీస్ వర్క్ చేయాలనీ భావించే వాళ్లకు సైతం ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. రైల్ టెల్ సహాయంతో ఈ సేవలను అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.  ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సదుపాయాలను అందించే విషయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

స్మార్ట్ ఫోన్లలో మొదట వైఫై మోడ్ ను ఆన్ చేసి ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత రైల్ వైర్  వైఫై నెట్వర్క్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అందులో ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి మొబైల్ ఫోన్ కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ వివరాలను ఎంటర్ చేయాలి. మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఈ సర్వీసులను సులువుగా పొందవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: