వివాదాల సావాసం లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇప్పటికే విరివిగా నానుతోంది. మీడియా లో తరచూ ఆమె పేరు వినిపిస్తోంది. ఈ హీరోయిన్ కోసం హీరోలు ఫర్హాన్ అక్తర్ , సిద్దార్థ్ రాయ్ కపూర్ లు కొట్టుకుంటున్నారు అంటూ మీడియా లో రూమర్లు వినిపిస్తున్న వేళ దీని మీద మీడియా వారి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇప్పటికే శ్రద్ధ ఇబ్బంది పడుతోంది.


అలాంటిది ఆమెని విలేఖర్లు సమావేశం లో అడ్డంగా బుక్ చేసాడు రైటర్ చేతన్ భగత్. అతను రాసిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల ఆధారంగా ఒక కొత్త సినిమా సిద్దమియన్ సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ హీరోగా చెయ్యగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసింది. మోహిత్ శర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే లో విడుదల అవుతుందో. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది దానికి చేతన్ భగత్ ముఖ్య అతిదిగా వచ్చాడు.


విలేఖరులు బాయ్ ఫ్రెండ్ అంటూ ఎదో ప్రశ్న అడగగానే అతను ఆమె వంక చూపించేసాడు. " నువ్వైతేనే బాగా సమాధానం చెప్పగలవు, నీ మీద మీడియా లో అఫైర్ల డిస్కషన్ సాగుతోంది కదా " అంటూ మైక్ ఇచ్చేసాడు చేతన్. ఒక్కసారిగా అంతటి ప్రముఖ రైటర్ అందరిలో ఆమెని ఇరికించగా శ్రద్ధా కపూర్ కి పిచ్చ కోపం వచ్చి పడింది.


అన్నిటికంటే ముందు ఆమె భారీగా షాక్ కి గురైంది. చేతన్ అలా అంటాడా అంటూ ఆమె ఇబ్బంది పడింది. వెంటనే మాటని దాటేసి వేరే విషయం మాట్లాడింది. మాటని అయితే దాటింది కానీ ఆమె మొఖం లోని కవళికలు అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆమెని కాపాడడానికి అన్నట్టు మైక్ అందుకున్న అర్జున్ కపూర్ టాపిక్ మార్చేసి ఆమెని కాపాడేసాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: