మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్పి కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ..ఒకే ఒక క్యారెక్టర్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. సినిమా ఆద్యంతం సస్పెన్స్గా థ్రిల్ కలిగిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో ప్రేక్షకుడు తనని తాను చూసుకుంటాడు.. ఈ సినిమా ఒక నిజ జీవితాన్ని చూపిస్తుంది. మాధవి లత ఈ సినిమా చేయడం, అది కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత చేయడం విశేషం.
ఏ ఆశ లేకుండా ఈ లోకంలోకి కళ్ళు తెరిచి వచ్చిన మనిషి తన చుట్టూ అల్లుకుపోయిన భావోద్వేగాలు, ప్రేమలు, ద్వేషాలు, కపటనాటకాలు, స్వార్థం కళ్ళల్లో కనిపించనివ్వకుండా మనసులోని దాచుకునే స్వభావాలు.. కళ్ళు మూసిన వెంటనే కార్చే కన్నీళ్ళు ఇదే జీవితం అని తెలుసుకున్న ఓ యువతి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.త్వరలోనే పాటలు విడుదల చేసి సినిమాను 2021లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాను అని అన్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఈమెకు ఈ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ ను అంధిస్తుందో చూడాలి..