నచ్చావులే సినిమా తో తెలుగు చిత్ర  పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ మాధవి లత.. ఈమె ఒకటో రెండో సినిమాలలో కనిపించి ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం యాక్టిివ్ గా ఉంటుంది. పవన్ అభిమాని గా చెప్పుకొని బాగా ఫేమస్ అయ్యింది. కాగా, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ అనే టైటిల్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సోలో పెర్ఫార్మెన్స్ చేయబోతుంది. జీఎస్‌ఎస్‌ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.



మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ..ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాం. సినిమా ఆద్యంతం స‌స్పెన్స్‌గా థ్రిల్ క‌లిగిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకుడు త‌న‌ని తాను చూసుకుంటాడు.. ఈ సినిమా ఒక నిజ జీవితాన్ని చూపిస్తుంది. మాధవి లతసినిమా చేయడం, అది కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత చేయడం విశేషం.



ఏ ఆశ లేకుండా ఈ లోకంలోకి క‌ళ్ళు తెరిచి వ‌‌చ్చిన మ‌నిషి త‌న చుట్టూ అల్లుకుపోయిన భావోద్వేగాలు, ప్రేమ‌లు, ద్వేషాలు, క‌ప‌ట‌నాట‌కాలు, స్వార్థం క‌ళ్ళల్లో క‌నిపించ‌నివ్వకుండా మ‌నసులోని దాచుకునే స్వభావాలు.. క‌ళ్ళు మూసిన వెంట‌నే కార్చే క‌న్నీళ్ళు ఇదే జీవితం అని తెలుసుకున్న ఓ యువతి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.త్వర‌లోనే పాటలు విడుద‌ల చేసి సినిమాను 2021లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాను అని అన్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఈమెకు ఈ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ ను అంధిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: