డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాల్లో  నటిస్తూ ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ మరో విలక్షణమైన పాత్రను ఈ 'రిపబ్లిక్‌' చిత్రంలో పోషిస్తున్నారు. ఆ పాత్రే  కలెక్టర్‌. రాజకీయ నాయకులు చేసే శాసనాలను ప్రజలకు అందించడంలో, శాసనాలను రూపొందించడంలో కీలకంగా ఉండే సివిల్‌ సర్వీస్‌ ఆఫీసర్స్‌ ... తప్పులు చేస్తున్న రాజకీయ నాయకులను, తప్పుల మీద తప్పులు చేస్తున్న రాజకీయ వ్యవస్థను ఓ యువకుడు ప్రశ్నిస్తే .. ఎదురు తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలంటే 'రిపబ్లిక్‌' సినిమా చూడాల్సిందే. సోమవారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.


పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ క్యూరియాసిటీ పెంచేయగా తాజాగా విడుదల చేసిన 'రిపబ్లిక్' టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రామ్‌ చరణ్‌ విడుదల చేయగా రెండు రోజుల క్రితం రిపబ్లిక్‌లో పవర్ఫుల్ పాత్ర చేస్తున్న రమ్య కృష్ణ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్థానం ఫెమ్ దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు 11:45 నిమిషాలకు రిలీజ్ అయ్యింది.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం అంటూ ప్రారంభం అయ్యే ఈ టీజర్ లో రాజకీయనాయకుల కిందే ప్రజలు, సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా బతుకుతున్నాయని.. రూలర్స్ కింద బానిసల్లా బతుకుతున్నారని సాయి ధరమ్ తేజ్ చాలా పవర్ ఫుల్‌గా డైలాగ్‌ను చెప్పే ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మీరు చుడండి.


రిపబ్లిక్ సినిమాలోలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తన్నారు. మణిశర్మ సంగీతం అందించగా జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను భగవాన్‌, పుల్లారావు నిర్మిస్తున్నారు. జూన్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: