సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు ఒక్కో దానిమీద ఒక్కో రకమైన మక్కువ వుంటుంది. అలాంటి హీరోయిన్లలో పూనం పాండే కూడా ఒకరు. ప్రస్తుతం WTC క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన క్రికెట్ అభిమానులు ఊహించని విధంగావర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆగిపోయిన విషయం తిరిగి నిన్నటి నుంచి మొదలైన విషయం కూడా తెలిసిందే. ఇక ఒక్కసారి తో క్రికెట్ ఆగిపోవడంతో క్రికెట్ అభిమానులు అసహనంతో ఉన్నారు. అలాంటి వారిని ఉత్సాహపరి చేందుకు,"పూనం మీకు ఆఫర్ కావాలా నాయనా..! అంటోంది". ఇండియన్ టీం గెలిస్తే బట్టలు తీసేయాలా ? అని ప్రశ్నిస్తోంది. అయితే ఈమె ఇప్పుడు అలా ఎందుకు అందో ఒకసారి చూద్దాం.


పూనం పాండే 2013లో "మాలిని & కో" చిత్రంతో తెలుగు లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఏదైనా ఫోటోలను అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.  2011లో ప్రపంచ కప్ క్రికెట్ లో ఇండియా గెలిస్తే తను స్టేడియంలో బట్టలు లేకుండా తిరుగుతానంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


అయితే తాజాగా వరల్డ్ బెస్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా చేసింది. న్యూజిలాండ్ - భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో క్రికెట్ గురించి స్పందించమని కోరితే, ఈమె ఇలా ఘాటుగా రిప్లై ఇచ్చింది. అయితే క్రికెట్ మొదలైందా..?  క్రికెట్ ఆడుతున్నారా..? ఈసారి కూడా ఇండియా జట్టు గెలిస్తే మళ్లీ బట్టలు విప్పేయాలా ? ఇక పోతే..ఈ మ్యాచ్ గురించి సరిగా తెలియదు.. ఇంటికి వెళ్లి తెలుసుకుంటానంటు" కామెంట్ చేసింది.

అలా కామెంట్ చేయడంతో తన భర్త .."ఈసారి నీ బదులుగా నేను నగ్న ప్రదర్శన చేస్తానని అంటూ స్పందించాడు". దీనికి పూనమ్ పాండే స్పందిస్తూ.." నువ్వు అలా చేస్తే ఓడిపోతారు".. అని అని సమాధానం తెలిపింది. ఇలా కామెంట్ చేయడం ఆ వాక్యాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నెటిజన్లు ఆలా వాక్యాలు  చేయడం తప్పు కదా ..!అని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానంగా తాము ఇండియా గెలవాలని కోరుకుంటున్నాము..అందులో తప్పేం లేదని తెలిపింది. క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే కదా, అందులో నేను కూడా ఇష్టపడతాను కాబట్టి ఇలా చెప్పాను..అంటూ పూనమ్ బదులిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: